వార్నింగ్ : ఆ 42 యాప్స్ చాలా డేంజర్
వార్నింగ్ : ఆ 42 యాప్స్ చాలా డేంజర్
స్మార్ట్ఫోన్లో స్టోరేజ్ ఉంది కదా? అని ఎడాపెడా యాప్స్ను డౌన్లోడ్ చేస్తుంటారు కొంతమంది యూజర్లు. కానీ యాప్స్ను డౌన్లోడ్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ యాప్స్తో మాల్వేర్ అటాక్లు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు స్మార్ట్ఫోన్ యూజర్లకు పెనుముప్పు కలిగించే చైనీస్ యాప్స్ వివరాలను ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. దీనిలో 42 మొబైల్ అప్లికేషన్లున్నాయి. ఈ యాప్స్ వల్ల భారత భద్రతా వ్యవస్థకు ముప్పు వాటిల్లి ఉందని హెచ్చరించాయి. వెంటనే మీ స్మార్ట్ఫోన్ల నుంచి ఈ యాప్స్ను తొలగించాలని దేశీయ సైన్యాన్ని, పార్లమెంటరీని ఆదేశించాయి. '' చైనీస్ డెవలపర్లు అభివృద్ధి చేసిన యాప్స్ వాడటం ద్వారా ఫోన్లలోని సమాచారం అంతా చైనాకి చేరిపోతుంది. ఈ యాప్స్ డౌన్లోడ్ వల్ల మాల్వేర్ అటాక్స్ జరుగుతున్నాయి'' అని వార్నింగ్ బెల్ మోగించింది.
ఆ 42 మొబైల్ యాప్స్ను వెంటనే అన్ఇన్స్టాల్ చేసి, స్మార్ట్ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని భారత సైన్యానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆదేశాలు జారీచేసింది. అదనంగా కొన్ని ఇంటర్నెట్ మోడల్స్ను కూడా హానికరమైన కార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని పేర్కొంది. ఏ యాప్ అయినా డేటాను అధికంగా వినియోగిస్తుంటే.. అది కచ్చితంగా అదనపు సమాచారాన్ని సేకరిస్తుందని భావించాలని భద్రతా నిపుణులు సందీప్ సేన్ గుప్తా వెల్లడించారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిత యాప్స్గా పేర్కొన్న వాటిలో అత్యంత పాపులర్ అయిన షేర్ ఇట్, ట్రూకాలర్, యాంటీ వైరస్, వెబ్ బ్రోజర్స్ వంటివి కూడా ఉన్నాయి.
Post a Comment